News April 3, 2024
‘రాజ్యాంగ సవరణ’.. మరో బీజేపీ నేత నోట అదే మాట!

ఎన్నికల వేళ మరో BJP నేత రాజ్యాంగంపై కామెంట్ చేసి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది’ అని రాజస్థాన్లోని నాగౌర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా పేర్కొన్నారు. కాగా ఇటీవల కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేయగా బీజేపీ ఆయనకు టికెట్ రద్దు చేసింది.
Similar News
News March 28, 2026
యుద్ధంలో ఇరాన్కు రోజుకు ₹1,319 కోట్ల ఆదాయం

ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం ఇరాన్కు వరంగా మారింది. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించిన ఆ దేశం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా రోజుకు ₹1,319 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు రవాణా చేయలేక సతమతమవుతుంటే ఇరాన్ మాత్రం రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్ మౌలిక సదుపాయాలు సేఫ్గా ఉండటంతో ఆ దేశానికి ఆర్థికంగా కలిసొస్తోంది.
News March 28, 2026
చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.
News March 28, 2026
యుద్ధంలోకి యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్పై మిస్సైల్ దాడి

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పశ్చిమాసియా యుద్ధంలోకి దిగారు. ఇవాళ యెమెన్ నుంచి ఇజ్రాయెల్పైకి బాలిస్టిక్ మిస్సైల్ను లాంచ్ చేశారు. దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీల మొదటి దాడి ఇదే. కాగా ఇరాన్కు వ్యతిరేకంగా US, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎవరైనా వస్తే తామూ రణరంగంలోకి దిగుతామని హౌతీలు నిన్న ప్రకటించారు.


