News March 26, 2025
అనుమతి లేకుండానే భవన నిర్మాణం?

TG: భద్రాచలంలో ఆరంతస్తుల <<15893602>>భవనం కుప్పకూలిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత భవనంపైనే మరో ఐదంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రస్టు పేరిట విరాళాలు సేకరించి ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. నిర్మాణం చేపట్టవద్దని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని అంటున్నారు. శిథిలాలను యంత్రాలను(పొక్లెయిన్లు) ఉపయోగించి తొలగిస్తున్నారు.
Similar News
News November 12, 2025
ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>
News November 12, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.
News November 12, 2025
ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు: చంద్రబాబు

AP: మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని CM చంద్రబాబు అన్నారు. ఇమామ్, మౌజమ్లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5వేలు ఇస్తామన్నారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసినా మైనారిటీల ద్వారానే ఆస్తుల సంరక్షణ చేస్తామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి అందరూ పరిశీలించేలా చేస్తామన్నారు.


