News October 24, 2024
కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక

AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.
Similar News
News January 31, 2026
నేను విన్నర్.. కింగ్ మేకర్ను కాదు: విజయ్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. ‘నన్ను కింగ్ మేకర్ అనడం నాకు ఇష్టముండదు. కింగ్ మేకర్ అంటే మెయిన్ డ్రైవర్ కాదు.. సపోర్టర్. నేను గెలుస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్ ఎందుకవుతా? మా సభలకు వస్తున్న క్రౌడ్ను చూడట్లేదా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించానన్నారు.
News January 31, 2026
ఎప్స్టీన్ ఫైల్స్.. 3M+ డాక్యుమెంట్లు విడుదల

అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు సంబంధించి మరో 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లను US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ <<18618902>>విడుదల<<>> చేసింది. ఇందులో 2వేల వీడియోలు, 1.8లక్షల ఫోటోలు ఉన్నాయి. ఎప్స్టీన్ ఆస్తులు, ప్రముఖులకు అతడు చేసిన మెయిల్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు సమాచారం. ఎప్స్టీన్ కేసులో ప్రముఖుల పేర్లు వినిపించడంతో ట్రాన్స్పరెన్సీ కోసం ట్రంప్ ఫైల్స్ విడుదలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
News January 31, 2026
జనవరి 31: చరిత్రలో ఈ రోజు

* 1666: మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం
* 1905: కవి, రచయిత కందుకూరి రామభద్రరావు జననం
* 1949: ప్రజా గాయకుడు గద్దర్ జననం
* 1972: మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ జననం
* 1975: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా జననం
* 1997: టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ జననం
* 2009: హాస్యనటుడు నగేష్ మరణం


