News October 24, 2024
కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక
AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.
Similar News
News October 24, 2024
నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
AP: విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు అక్కడికి చేరుకుంటారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. కాగా గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
News October 24, 2024
వర్సిటీల ప్రగతిపై 3 నెలలకోసారి సమీక్షిస్తా: గవర్నర్
TG: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. విద్యాపరంగా సాధించిన వృద్ధిపై సమీక్ష చేపడతానని చెప్పారు. ఉన్నత విద్య రూపురేఖలు మార్చడంలో వీసీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య, విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారేందుకు కృషి చేయాలని తనను కలిసిన కొత్త వీసీలకు సూచించారు.
News October 24, 2024
ముసుగు తొలిగిపోయింది: YCP
AP: జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై TDP<<14435746>> ట్వీట్<<>> చేయడంపై YCP స్పందించింది. ‘ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను TDP అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టినప్పుడే మీరంతా ఒకటేనని స్పష్టమైంది. అనుబంధాల గురించి CBN మాట్లాడటం విడ్డూరం. తన ఆస్తుల్లో తోబుట్టువులకు CBN ఎంతిచ్చారు? NTRకు వెన్నుపోటు పొడవలేదా? హరికృష్ణను, తనతో పాటు హెరిటేజ్ పెట్టిన నటుడ్ని గెంటేయలేదా?’ అని నిలదీసింది.