News January 10, 2025
సంభల్ బావిపై స్టేటస్ కో కొనసాగించండి: SC

సంభల్లోని షాహీ జామా మసీదు వద్ద ఉన్న బావి విషయమై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్థానిక యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు సర్వేను సవాల్ చేస్తూ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై CJI బెంచ్ విచారించింది. బావి ప్రదేశాన్ని హరి మందిర్గా పేర్కొనడాన్ని పిటిషనర్లు తప్పుబట్టారు. స్టేటస్ కో కొనసాగించాలని, ఎలాంటి ఆదేశాలను అమలు చేయకూడదని స్పష్టం చేసింది.
Similar News
News December 17, 2025
MBNR: ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..UPDATE

మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
✒133 రిటర్నింగ్ అధికారులు,13 రిజర్వ్ తో కలిపి మొత్తం 146 మంది రిటర్నింగ్ అధికారులు
✒1152 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ తో కలిపి 1551 బ్యాలెట్ బాక్స్ లు
✒28 జోన్లకు రిజర్వ్ తో కలిపి 32 మంది జోనల్ అధికారులు
✒20 శాతం రిజర్వ్ తో కలిపి 3005 మంది పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు
✒పి.ఓ.లు 2310, ఓ.పి. ఓ.లు 3386 మంది అందుబాటులో ఉన్నారు.
News December 16, 2025
Photos: వనతారలో మెస్సీ పూజలు

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.
News December 16, 2025
మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

భారత్తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


