News July 28, 2024

వివాదం: కేరళ బ్యాంకు నివాళుల జాబితాలో ముషారఫ్‌ పేరు

image

కేరళలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అలప్పుళ శాఖ చేసిన ఓ పని కలకలం రేపింది. ఓ కార్యక్రమంలో నివాళులర్పించేందుకు సిద్ధం చేసిన ప్రముఖుల జాబితాలో పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పేరును చేర్చింది. 25వ కార్గిల్ విజయ దివస్ జరిగిన మరుసటి రోజే.. ఆ యుద్ధానికి కారణమైన ముషారఫ్‌ పేరును లిస్టులో పెట్టడం గమనార్హం. అనుకోకుండా జరిగిందంటూ బ్యాంకు ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పింది. దీనిపై బీజేపీ అలప్పుళలో నిరసన వ్యక్తం చేసింది.

Similar News

News December 4, 2025

సమంత-రాజ్ పెళ్లి.. మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

image

రాజ్-సమంత పెళ్లి చేసుకున్న మూడు రోజులకు రాజ్ మాజీ భార్య శ్యామలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. ఇటీవల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి. గత నెల 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయింది. నాకు PR టీమ్ లేదు. స్వయంగా రెస్పాండ్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

News December 4, 2025

టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్‌ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.

News December 4, 2025

వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

image

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT