News October 19, 2024
తక్కువ ధరలకే వంటనూనెలు: మంత్రి నాదెండ్ల
AP: రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. మరింత ఎక్కువగా వంటనూనెలను అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు.
Similar News
News October 19, 2024
Disney+ Hotstarలోనే IPL లైవ్ స్ట్రీమింగ్?
రిలయన్స్ తమ ప్రైమరీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా Disney+ Hotstarనే ఎంచుకుంటుందని తెలిసింది. IPL సహా అన్ని స్పోర్టింగ్ ఈవెంట్లను ఇందులోనే ఇస్తుందని రాయిటర్స్ పేర్కొంది. స్టార్ఇండియా వద్ద సుపీరియర్ టెక్నాలజీ ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. విలీనమయ్యాక డిస్నీ, జియోసినిమాను కలిపేయడం, వేర్వేరుగా కొనసాగించడం, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ను వేర్వేరు యాప్స్లో ఇవ్వడంపై RIL యోచిస్తున్నట్టు వెల్లడించింది.
News October 19, 2024
మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటా: KTR
TG: మూసీ పరీవాహకంలో ఉండాలన్న సీఎం రేవంత్ <<14382694>>సవాల్ను<<>> బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వీకరించారు. మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని స్పష్టం చేశారు. తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలోనే ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తామని వ్యంగ్యంగా మాట్లాడారు. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
News October 19, 2024
తిరుపతిలో ‘బడి వైన్స్’.. నెటిజన్ల ట్రోల్స్
AP: నూతన మద్యం విధానంలో భాగంగా ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ఓ ప్రైవేటు మద్యం షాపు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాని పేరు ‘బడి వైన్స్’ అని ఉండటమే దీనికి కారణం. నాన్నలకూ ఓ బడి తెరిచారని, అక్కడ ‘మందు’ చదువులు చెబుతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదని, ఆ షాపు యజమాని ఇంటి పేరే అదని పలువురు పేర్కొంటున్నారు.