News September 5, 2024

పోలీసులు లంచం ఆఫర్ చేశారు: హత్యాచార బాధితురాలి పేరెంట్స్

image

తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగిస్తూ పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆర్జీకర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. నిన్న రాత్రి కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘పోలీసులు ఈ కేసును త్వరగా మూసేసేందుకే ప్రయత్నించారు. ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వలేదు. పోస్ట్‌మార్టం టైమ్‌లో మేం PSలోనే ఉన్నాం. బాడీని అప్పగిస్తూ సీనియర్ అధికారి డబ్బును ఆఫర్ చేశారు. మేం వెంటనే తిరస్కరించాం’ అని తెలిపారు.

Similar News

News November 16, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 16, 2025

AP న్యూస్ రౌండప్

image

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ

News November 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

image

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>