News September 11, 2025

మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

image

* పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి.
* పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.

Similar News

News September 11, 2025

ఐశ్వర్యారాయ్‌ AI ఫొటోస్ తొలగించండి: ఢిల్లీ HC

image

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్ఫ్‌డ్ ఫొటోస్‌ను అడల్ట్ సైట్స్‌లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్, URLsను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇది ఆమె పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది.

News September 11, 2025

మన కంపెనీలకు సవాలేనా?

image

చైనా, వియత్నాం నుంచి భారత ఆటోమొబైల్ కంపెనీలకు సవాల్ ఎదురుకానుంది. చైనాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ల కంపెనీ BYD.. ఇండియాలో ప్లాంట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటే సుంకాల వల్ల రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Atto 2 SUV EVని రూ.20 లక్షల్లోపు తీసుకురావాలని భావిస్తోంది. అటు వియత్నాం VinFast రూ.16 లక్షలకే VF6 EV కారును లాంఛ్ చేసింది.

News September 11, 2025

గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా

image

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రేపు ఆయన ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.