News April 3, 2024

వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం: లోకేశ్

image

AP: వృద్ధురాలి మృతిపై వైసీపీ శవ రాజకీయం చేస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘సహజంగా మరణించిన వృద్ధురాలి శవాన్ని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లేందుకు మంత్రి జోగి రమేశ్ డ్రామా ఆడారు. ఆయన్ని వృద్ధురాలి బంధువులు తిట్టి అక్కడి నుంచి పంపించారు. 2014లో తండ్రి శవం.. 2019 బాబాయ్ శవం.. 2024 పెన్షనర్ శవం. వైసీపీ బతుకే ఫేక్.. ఆ పార్టీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News February 5, 2026

మాదాపూర్ PSలో చంద్రహాస్‌పై కేసునమోదు

image

మాదాపూర్ PSలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. ఓ ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడినట్టు ఫిర్యాదుల మేరకు ఓ టీవీ ఎడిటర్ అశోక్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఆడియో ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 5, 2026

T20 WC: భారత్ ఘన విజయం

image

T20 WC వార్మప్‌ మ్యాచ్‌లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్‌లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

News February 5, 2026

దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

image

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.