News September 27, 2024

వైసీపీ పాలనలో అవినీతి పెరిగింది: పురందీశ్వరి

image

AP: రివర్స్ టెండరింగ్ వల్ల నిలిచిపోయిన పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు, MP పురందీశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ₹12వేల కోట్లు మంజూరు చేసిందని, అమరావతికి ₹15వేల కోట్లు ఇవ్వనుందని చెప్పారు. BJP సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. YCP పాలనలో అవినీతి పెరిగి రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టిందని ఆరోపించారు.

Similar News

News November 27, 2025

ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి నిఫ్టీ

image

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్‌ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.

News November 27, 2025

వైకుంఠద్వార దర్శనం.. రిజిస్ట్రేషన్ మొదలు

image

AP: తిరుమలలో DEC 30 నుంచి JAN 8 వరకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి 3 రోజులకు నేటి నుంచి DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్‌లు పంపుతారు. ఈ పవిత్ర దినాల్లో స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

News November 27, 2025

RITESలో 252 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>)లో 252 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, బీఆర్క్, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/