News April 6, 2024
జగనన్న కాలనీల్లో అవినీతి జరిగింది: పురందీశ్వరి

AP: కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షలు మాత్రమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని, భూమిని చదును చేసే పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. రాజమండ్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు పరిధిలోని జనసేన, టీడీపీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తామన్నారు.
Similar News
News February 10, 2026
సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్లో సూర్య చెలరేగడం తెలిసిందే.
News February 10, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News February 10, 2026
ఉపవాసం ఎందుకు ఉండాలి?

ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు. మనస్సును దైవచింతనలో నిలపడం. సంకల్పించిన దేవతకు రోజును అంకితం చేయడం. ధ్యానం, పూజలు, మహిమల పఠనంలో గడపాలి. సహనంగా ఉండాలి. జంతువుల పట్ల దయ చూపాలి. శరీరం, మనస్సును శుద్ధిగా ఉంచాలి. శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. మాటలు, ఆలోచనలలో క్రూరత్వం, దురాశ వీడాలి. నిస్వార్థ పనులు చేయాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. వీలైతే మౌనంగా ఉండాలి.


