News April 6, 2024
జగనన్న కాలనీల్లో అవినీతి జరిగింది: పురందీశ్వరి
AP: కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షలు మాత్రమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని, భూమిని చదును చేసే పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. రాజమండ్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు పరిధిలోని జనసేన, టీడీపీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తామన్నారు.
Similar News
News October 9, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:20 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:58 గంటలకు
ఇష: రాత్రి 7.11 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 9, 2024
10 గంటల పాటు అజారుద్దీన్ను విచారించిన ఈడీ
TG: హెచ్సీఏలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ను ఈడీ 10 గంటల పాటు విచారించింది. తాను విచారణకు పూర్తిగా సహకరించినట్లు ఆయన తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. కుట్రతోనే తనపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు.
News October 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.