News May 2, 2024

తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది: మోదీ

image

కర్ణాటక, తెలంగాణ.. కాంగ్రెస్‌కు ATMలుగా మారిపోయాయని PM మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందే ఈ 2 రాష్ట్రాల్లో త్వరలో జరగబోతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది. INC, BRS ఒకటే. ప్రస్తుతం కమీషన్ లేకుండా ఏ పనీ జరగట్లేదు. లిక్కర్ స్కామ్‌లో BRS పేరుంది. ఇక టెక్నాలజీ హబ్‌గా ఉన్న కర్ణాటక ఇప్పుడు ట్యాంకర్ హబ్‌గా మారిపోయింది’ అని విమర్శించారు.

Similar News

News March 25, 2026

ఇంధనం నిల్వ.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

image

‘పానిక్ బయింగ్’ వల్లే అమ్మకాలు మూడింతలు పెరిగాయని TG పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ‘‘ఇంధనం ఆవిరై గాలిలో కలిసినా లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ‘స్టాటిక్ ఎలక్ట్రిసిటీ’ ఉత్పన్నమైనా భారీ పేలుళ్లు సంభవించవచ్చు. పెట్రోల్ నుంచి వచ్చే వాసన పీల్చితే శ్వాసకోశ సమస్యలు, తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి’’ అని నిపుణులు తెలిపారు.

News March 25, 2026

LPG వెయిటింగ్ పీరియడ్‌లో మార్పు లేదు: కేంద్రం

image

వంట గ్యాస్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్‌లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. గడువు యథావిధిగా పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగానే కొనసాగుతోందని తెలిపింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులకు.. నాన్ PMUYలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25రోజులు, డబుల్‌కు 35రోజులకు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.

News March 25, 2026

రాత్రిపూట ఎంగిలి పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తున్నారా?

image

రాత్రి భోజనం తర్వాత అంట్లు తోమకుండా వంటగదిలో అలాగే వదిలేయడం వాస్తు రీత్యా చాలా అశుభం. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా దరిద్రం, పేదరికం రావొచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎంగిలి పాత్రల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే వీలైనంత వరకు రాత్రే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయి