News April 8, 2025
KG రైస్కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరు

AP: మద్యం కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సిట్కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.
News April 17, 2025
వరుసగా మూడ్రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. గుడ్ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేగా ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులూ పనిచేయవు. పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు శనివారమూ సెలవు ఉండటంతో ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు సెలవులు రానున్నాయి. మీకూ వరుస సెలవులు వచ్చాయా? కామెంట్ చేయండి.
News April 17, 2025
రోజూ ఆకుకూరలు తింటే ఇన్ని లాభాలా?

రోజూ ఆకుకూరలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘పాలకూరతో గుండెపోటు రిస్కు తగ్గుతుంది. కొత్తిమీర కొలస్ట్రాల్ లెవెల్స్ను 10-15% తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ను తగ్గించి బ్రెస్ట్ & ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్కును తప్పిస్తుంది. గోంగూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు.