News October 1, 2024

పత్తి క్వింటాల్ రూ.7,521.. నేటి నుంచి కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లను CCI ప్రారంభించనుంది. మొత్తంగా 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధరను చెల్లించనుంది. కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతుంది. పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లిచ్చిన నమోదుపత్రంతో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.

Similar News

News November 24, 2025

స్మృతి పెళ్లి వాయిదా.. మరో బిగ్ ట్విస్ట్!

image

స్మృతి మంధాన పెళ్లి వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు పెళ్లి వేడుకకు సంబంధించి SMలో పోస్ట్ చేసిన ఫొటోలను స్మృతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాలో ఆ ఫొటోలు, వీడియోలేమీ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఆమె అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. నిన్న వివాహం జరగడానికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు రాగా తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యారు.

News November 24, 2025

19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

image

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News November 24, 2025

ధర్మేంద్ర బాలీవుడ్ ‘He-Man’ ఎలా అయ్యారంటే?

image

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్‌ అని నిక్ నేమ్ ఉంది. ధర్మేంద్రకు ఉన్న మస్క్యులర్ బాడీ, రగ్గ్‌డ్ లుక్స్, 1960-70ల మధ్య ఎక్కువగా యాక్షన్ పాత్రలు చేయడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి జానర్స్‌ కలుపుకుని దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర చివరిగా నటించిన ‘ఇక్కీస్’ అనే చిత్రం త్వరలో విడుదలకానుంది.