News September 10, 2024
పత్తి మద్దతు ధర క్వింటా ₹7,521: మంత్రి అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 50 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. క్వింటా ₹7,521 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు. CCI, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 5.79L హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు.
Similar News
News January 23, 2026
వరిలో రాగి, బోరాన్ లోపాన్ని ఇలా గుర్తించండి

వరిలో రాగి సూక్ష్మపోషకం లోపిస్తే ఆకు చివర ఎండి, ఆకుపై ముతక ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వెన్నులోని గింజలు చిన్నవిగా ఉంటాయి. రాగి లోప నివారణకు ఆకులపై ఒక లీటరు నీటిలో 1 గ్రాము కాపర్సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపిస్తే పంట లేత ఆకుల చివరలు మెలితిరిగి, వేర్లు వృద్ధి చెందవు. పంట ఎదుగుదల సరిగా ఉండదు. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ ద్రావణాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News January 23, 2026
వృత్తులు చేస్తున్నారా? ఇలా చేస్తే నైపుణ్యం మీవెంట..

సరస్వతీ దేవిని ‘సకల కళా స్వరూపిణి’ అంటారు. అందుకే ఈ రోజున సంగీతకారులు తమ వాయిద్యాలను (వీణ, తబలా, వయొలిన్), చిత్రకారులు తమ కుంచెలను, డ్యాన్సర్స్ తమ గజ్జెలను పూజించాలి. దీనివల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. అలాగే వృత్తి పని వారు తమ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం వల్ల ఆ వృత్తిలో నైపుణ్యం పెరిగి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఏ రంగంలో అయినా ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ దినం ఒక వరం.
News January 23, 2026
అమెజాన్లో 16 వేల ఉద్యోగాల కోత!

అమెజాన్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ 30 వేల మందిని తొలగించనుందని గతేడాది అక్టోబర్లో రాయిటర్స్ తెలిపింది. ఈ క్రమంలో తొలి విడతలో 14 వేల మందిని ఆ కంపెనీ ఇంటికి పంపింది. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తమకు మేనేజర్లు హింట్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. 2023లోనూ 27 వేల మందిని అమెజాన్ తీసేసింది.


