News November 3, 2024
కెప్టెన్గా, బ్యాటర్గా రాణించలేకపోయా: రోహిత్

న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో కెప్టెన్గానూ, బ్యాటర్గానూ తాను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఈ సిరీస్ ఓటమి తనను బాధిస్తుందని చెప్పారు. జట్టుగానూ సరైన ప్రదర్శన చేయలేకపోయామని, పరాజయాలకు ఇదే కారణమని పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్సులో మరో 30 పరుగులు చేయాల్సి ఉందన్నారు. అయితే NZ తమకంటే మెరుగ్గా ఆడిందని, ఓటమిని స్వీకరిస్తున్నామని తెలిపారు.
Similar News
News December 18, 2025
ఫలితాలు విడుదల

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <
News December 18, 2025
22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ‘పదవి-బాధ్యత’ పేరుతో మంగళగిరిలో జరిగే ఈ భేటీలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLAలు, MLCలు, MPలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు హాజరుకావాలని ఆదేశించారు.
News December 18, 2025
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. TGలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు YELLOW ALERT ఇచ్చింది. అటు APలోని మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి.


