News July 2, 2024
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

AP: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 5 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 11-15 వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చు. 19న సీట్లు కేటాయిస్తారు. 20-22 తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు VIJలోని SRR, విశాఖలోని VS కృష్ణ, TPTలోని SV వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.
Similar News
News March 10, 2026
AP, TG ఎంత అప్పు చేశాయంటే?

2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP రూ.56,072Cr, TG రూ.69,300Cr అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP రూ.26,572Cr, TG రూ.17,400Cr, రెండో క్వార్టర్లో AP రూ.17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్లో AP రూ.11,900Cr, TG రూ.19,400Cr ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.
News March 10, 2026
ఏజెన్సీల ‘బ్లాక్’ దందా.. భారీ ధరకు సిలిండర్ల విక్రయం!

LPG సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏజెన్సీలు సాధారణ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడొచ్చని, చూసి వాడుకోవాలంటూ గేటెడ్ కమ్యూనిటీల్లో యాజమాన్యాలు అలర్ట్ SMSలు పంపుతున్నాయి.
News March 10, 2026
32,000 మంది అనర్హులకు PMKY నిధులు

PM కిసాన్ పథకం TGలో పక్కదారి పట్టింది. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసిన వారు, ఇతర అనర్హులు ఇలా 32 వేలమంది లబ్ధి పొందినట్లు తేలింది. ఈ-కేవైసీలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారు, అధిక భూమి ఉన్నవారు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి కలిగినట్లు తేలింది. వీరికి PMKY నిలిపేశారు. పరిశీలన పూర్తయితే అనర్హులు ఇంకా తేలనున్నారు. ఈ స్కీములో ఏడాదికి ఎకరాకు ₹6వేలు ఇస్తున్నారు.


