News September 24, 2024

టీడీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: జూపూడి

image

ఏపీలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీలో ఎస్సీ డాక్టర్‌ను దూషించిన MLA పంతం నానాజీని పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంబేడ్కర్ ప్లెక్సీని తగులబెట్టిన MLA రఘురామకృష్ణం రాజు క్షమాపణలు తెలపాలి. దళితులంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నందుకు కక్ష గట్టారు. టీడీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది’ అని హెచ్చరించారు.

Similar News

News November 1, 2025

ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం

image

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్‌లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్‌కు అవకాశం దక్కేలా కోటా విధించారు.

News November 1, 2025

ఇతరుల అదృష్టం చూసి, వారిలా ఇల్లు కట్టొచ్చా?

image

ఇతరుల అదృష్టం చూసి వారి ఇంటిలాగే మనం కూడా ఇల్లు కట్టుకుంటే అదే ఫలితం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఇంటి నిర్మాణానికి, ఇంటి స్థలం, దిశ, ముఖద్వారాలకు ఇంటి యజమాని పేరు, జన్మరాశి అనుకూలంగా ఉండాలన్నారు. ‘ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్, మంచాలు వంటి అమరికలు కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకూలమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News November 1, 2025

ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం: జగన్

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి వేళ భక్తులు వస్తున్నారని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.