News September 20, 2025

J&Kలో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్‌లో టెర్రరిస్టులు!

image

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ జవానుకు గాయాలు కాగా 3-4 మంది టెర్రరిస్టులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ నిన్న రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.

Similar News

News September 20, 2025

TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

image

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.

News September 20, 2025

ఉల్లి పంటలో బోల్డింగ్ అంటే ఏమిటి?

image

ఉల్లి మొక్కల్లో శాఖీయ పెరుగుదల పూర్తికాక ముందే పుష్పించడాన్ని బోల్డింగ్ అంటారు. జన్యుపరమైన లోపాలు, ఉష్ణోగ్రతల్లో అసమానతలు, నాణ్యతలేని విత్తనాల వినియోగం, నాటిన తొలిదశలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దీనికి కారణం. ఈ సమస్య నివారణకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి. పొటాషియం ఎరువులను ఎకరానికి 30 కిలోలు వేసుకోవాలి. నీటి ఎద్దడి లేకుండా చూడాలి. 10 లీటర్ల నీటికి 2.5ml మాలిక్ హైడ్రోజైడ్ కలిపి పిచికారీ చేయాలి.

News September 20, 2025

కాలీఫ్లవర్‌‌పై గోధుమ రంగు మచ్చలకు కారణమేంటి?

image

కాలీఫ్లవర్‌పై గోధుమ రంగు మచ్చలు కనిపించడాన్ని ‘బ్రౌనింగ్’ అంటారు. సాధారణంగా క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడటమే కాకుండా కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 కిలోల బోరాక్స్ వేసుకోవాలి. లీటరు నీటికి 1.5-2.0 గ్రాముల డైసోడియం ఆక్టాబోరెట్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.