News April 3, 2024

అసత్య ప్రచారానికి కొత్త వెబ్‌సైట్‌తో అడ్డుకట్ట

image

లోక్‌సభ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. ‘mythvsreality.eci.gov.in’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు వెలుగులోకి వచ్చిన అసత్య ప్రచారాలను ప్రజలకు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామంది.

Similar News

News December 14, 2025

మెస్సీ వెంట ఉన్న ప్లేయర్ల గురించి తెలుసా?

image

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో, ఇద్దరు ప్లేయర్లు రోడ్రిగో డిపాల్(అర్జెంటీనా), లూయిస్ సువారెజ్(ఉరుగ్వే) భారత పర్యటనలో ఉన్నారు. వీరు US మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో(RHS).. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో సభ్యుడు. మరో ప్లేయర్ సువారెజ్(LHS) స్ట్రైకర్‌గా పేరొందారు. యూరప్ లీగ్‌లో 2 సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్నారు.

News December 14, 2025

INDvsSA.. గెలుపు ఎవరిదో?

image

టీ20 సిరీస్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్‌లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News December 14, 2025

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <>Xలో<<>> దుయ్యబట్టింది. ‘గత రెండేళ్లలో రాష్ట్రంలో 828 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 117 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందిపడ్డారు’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలు మీ మోసాన్ని గుర్తుంచుకుంటారని పేర్కొంది.