News February 8, 2025
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.
Similar News
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు
News December 8, 2025
చంద్రుడిపై చివరి అడుగుకు 53 ఏళ్లు

US ‘అపోలో-11’ మిషన్ ద్వారా 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు మిషన్లలో 12మంది ‘మామ’ను కలిసి వచ్చారు. జాబిలిపై మనిషి చివరిసారిగా కాలుమోపి 53ఏళ్లవుతోంది. 1972 DEC 7-19 మధ్య అపోలో-17 ద్వారా యూజీన్, హారిసన్ మూన్పై దిగారు. 75గంటలు గడిపి రోవర్పై 35KM ప్రయాణించారు. 110KGల రాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. వాటి ద్వారా అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని గుర్తించారు.
News December 8, 2025
BREAKING: సెలవుల జాబితా విడుదల

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


