News February 8, 2025
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.
Similar News
News November 21, 2025
బాపట్ల: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.apgov.in లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 21, 2025
7337359375 నంబర్కు HI అని పంపితే..

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


