News March 3, 2025
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 28, 2025
షమీ ఆన్ ఫైర్.. జాతీయ జట్టులో చోటు దక్కేనా?

రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా చెలరేగుతున్నారు. 2 మ్యాచ్ల్లో 68 ఓవర్లు వేసి 15 వికెట్లు పడగొట్టారు. తన ఫిట్నెస్, ఫైర్ తగ్గలేదని నిరూపించారు. NOV 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అగార్కర్, గంభీర్కు బిగ్ మెసేజ్ పంపారు. ఫిట్నెస్ లేదని WIతో టెస్టులకు, AUSతో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.
News October 28, 2025
పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్లో మార్పులు: CM CBN

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.
News October 28, 2025
భారీ వర్షాలు.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.


