News March 3, 2025

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

image

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 3, 2025

SEBI మాజీ చీఫ్, BSE అధికారులకు స్వల్ప ఊరట

image

మార్కెట్ అవకతవకలు, కార్పొరేట్ మోసం కేసులో SEBI, BSE అధికారులపై ACB FIR ఫైల్ చేయాలన్న ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో సెషన్స్ కోర్టు ఆదేశాలు చెల్లుబాటు కావన్న రెస్పాండెంట్స్‌ లాయర్ల వాదనను అంగీకరించింది. TUE వాదనలు వింటామంది. సెబీ మాజీ చీఫ్ మాధబీ, మెంబర్లు అశ్వనీ, అనంత్, కమలేశ్, BSE ఛైర్మన్ ప్రమోద్, CEO సుందర రామన్‌కు ఊరటనిచ్చింది.

News March 3, 2025

టెన్త్ హాల్ టికెట్లు విడుదల

image

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి <>డౌన్‌లోడ్<<>> చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్వీస్ ‘మన మిత్ర’లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News March 3, 2025

చదివేటప్పుడు నిద్ర కమ్ముకొస్తుందా?

image

అలా అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చదవడం ప్రారంభించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకొని చదవొద్దు. చదివే సమయంలో నీరు ఎక్కువగా తాగండి. గట్టిగా చదవటం, నోట్స్ రాయటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. 50ని.లకు ఒకసారి బ్రేక్ తీసుకొని, ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. మీ రీడింగ్ రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. బ్రేక్‌ టైంలో కాస్త నడిస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. Share It.

error: Content is protected !!