News May 3, 2024
మోదీ హయాంలో దేశం నాశనం: కేసీఆర్

TG: తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం ముగియడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. రామగుండం రోడ్షోలో మాట్లాడుతూ.. ‘మోదీ హయాంలో దేశం నాశనం అవుతోంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.84కు దిగజారింది. ఆయన పాలనలో మత విద్వేషం తప్ప ఇంకేమీ లేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
MNCL: ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి: డి.భాగ్యవతి

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ రూ.4వేలు అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి డి.భాగ్యవతి తెలిపారు. మండల, జిల్లా, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు 2025 – 26 ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 21, 2025
పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం


