News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
Similar News
News January 22, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.
News January 22, 2026
పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికీ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు నిద్రకు 1-2 Hr ముందే నీళ్లు తాగడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.
News January 22, 2026
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

T20 WC మ్యాచులు భారత్లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.


