News August 10, 2024

కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. జాగ్రత్త: WHO

image

కొన్ని వారాలుగా 84 దేశాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని WHO వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని వేరియంట్లు వ్యాపించనున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు కొవిడ్/శ్వాసకోశ వ్యాధుల బారిన పడినట్లు పేర్కొంది. కరోనా ఇప్పటికీ మనతోనే ఉందని WHO డాక్టర్ మరియా చెప్పారు. ఓవరాల్‌గా పాజిటివ్ కేసుల సంఖ్య 10%, ఐరోపాలో 20% పైగా ఉందని పేర్కొన్నారు.

Similar News

News March 25, 2026

చిత్తూరు: అందుకోసమే కలపలేదా.?

image

జిల్లాల పునర్విభజన సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపలేదు. అలాగే నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలనూ తిరుపతిలో కలపాలని పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ ఉన్నా అలా జరగలేదు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన సమయంలో ప్రక్రియ సులువుగా సాగేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.

News March 25, 2026

ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ

image

AP: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 46 ఏళ్లుగా ఉందని, ఇక్కడ కూడా 46కి పెంచాలని కోరారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

News March 25, 2026

రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

image

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.