News May 9, 2024

CP ORDERS: హైదరాబాద్‌‌లో WINES బంద్

image

లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు విధిస్తున్నట్లు‌ CP కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ట్విన్‌ సిటీస్‌లో 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బులు‌, క్లబ్బులు‌, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ 48 గంటలు‌ ప్రచారం కూడా‌ చేయొద్దని‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
SHARE IT

Similar News

News October 3, 2024

HYD: యూనివర్సిటీ ర్యాంకుల FULL REPORT

image

✓HYDలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇండియాలో 40వ ర్యాంకు సాధించింది✓ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది✓న్యాయవిద్యలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు✓ఇన్నోవేషన్ విభాగంలో IITH మూడో ర్యాంకు✓పరిశోధనల్లో IITH 15, HCU 18 ర్యాంకు ✓వ్యవసాయ కళాశాలల్లో జయశంకర్ యూనివర్సిటీ 37వ ర్యాంకు ✓IIIT HYD టాప్ 100 యూనివర్సిటీలో 74వ ర్యాంక్

News October 3, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం: సీపీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

News October 2, 2024

BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.