News August 18, 2025

మోదీతో సీపీ రాధాకృష్ణన్ భేటీ

image

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తనను అభ్యర్థిగా నిలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాధాకృష్ణన్ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు రేపు మధ్యాహ్నం కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది.

Similar News

News August 18, 2025

Airtel నెట్‌వర్క్ డౌన్.. యూజర్స్ ఫైర్

image

దేశంలోని పలు ప్రాంతాల్లో Airtel నెట్‌వర్క్ డౌన్ అయింది. దీనిపై యూజర్స్ SMలో ఫైర్ అవుతున్నారు. కాల్స్, ఇంటర్నెట్ సమస్యలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ స్పందించింది. ‘మా టీం ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోంది. త్వరలో సేవలను పునరుద్ధరిస్తాం. అసౌకర్యానికి క్షమించండి’ అని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

News August 18, 2025

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనా?

image

NDA ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ ఎంపికవ్వగా విపక్ష INDI కూటమి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తమిళనాడుకే చెందిన DMK MP తిరుచ్చి శివను ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2026 TN అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2 కూటములు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో జరిగే ప్రతిపక్షాల భేటీలో అభ్యర్థి ఎవరో తేలనుంది.

News August 18, 2025

భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకండ్లకు రూ.16లక్షలు

image

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవనున్న ఆసియా కప్‌లో భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లకు యాడ్స్ పరంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ టోర్నీని బ్రాడ్‌కాస్ట్ చేయనున్న సోనీ TVలో 10సెకండ్ల యాడ్ స్లాట్‌కు రూ.16 లక్షల ధర నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. వచ్చే నెల 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. తర్వాత సూపర్-4 స్టేజ్‌లోనూ ఎదురుపడే అవకాశముంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే 28న టైటిల్ కోసం తలపడుతాయి.