News August 10, 2024
ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

TG: సీపీగెట్-2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. సవరణలకు 26 వరకు అవకాశమివ్వగా 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయనున్నారు. అదే నెల 9న విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ SEP 15న మొదలుకానుంది.
Similar News
News October 20, 2025
వేధిస్తున్నారంటూ ఓలా ఉద్యోగి ఆత్మహత్య.. CEOపై కేసు

తనను వేధిస్తున్నారంటూ బెంగళూరులో Ola Electric ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. Ola ఇంజినీర్ అరవింద్ sept 28న సూసైడ్ చేసుకోగా, అతడి రూమ్లో డెత్నోట్ను పోలీసులు గుర్తించారు. CEO భవీశ్ అగర్వాల్, సీనియర్ ఉద్యోగి సుబ్రతా కుమార్ వేధిస్తూ, జీతాలివ్వలేదని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అరవింద్ చనిపోయిన 2రోజులకు అతడి ఖాతాలో ₹17.46L జమయ్యాయి. దీంతో ఈనెల 6న పోలీసులు భవీశ్పై కేసు నమోదు చేశారు.
News October 20, 2025
బాణసంచా పేలి గాయమైతే..

బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలిన భాగాన్ని 15 నిమిషాల పాటు కుళాయి నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల పటాకుల వేడి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని అంటున్నారు. అలాగే కాలిన భాగంలో పసుపు పొడి, పేస్ట్ వంటివి పూయకూడదని, దీనివల్ల గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ఉన్న చోట టపాకాయలు పేల్చవద్దని సూచిస్తున్నారు.
News October 20, 2025
సీఎం రేవంత్తో కొండా సురేఖ దంపతుల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.