News September 19, 2024
జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన CPI(M)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News November 3, 2025
RTC బస్సులకు కెపాసిటీ లిమిట్ రూల్ ఉండదా?

ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ఒక్కరు ఎక్కువున్నా RTA ఫైన్లు విధిస్తుంది. మీర్జాగూడ ప్రమాదంతో ఇదే రూల్ RTC బస్సులకు వర్తించదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. RTC సర్వీసుల్లో చాలా రూట్లలో, చాలా సమయాల్లో సీట్లు నిండి లోపల కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో నిండి ఉంటాయి. దీనికి తక్కువ బస్సులు, ప్రజల అవసరాలు లాంటివి కారణం కావచ్చు. కానీ RTCకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేదే అందరి ప్రశ్న.
News November 3, 2025
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీని కోసం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
News November 3, 2025
బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా


