News May 22, 2024

సిట్ నివేదికను బయటపెట్టాలని సీపీఎం డిమాండ్

image

AP: పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయని సిట్ తేల్చిందన్నారు. FIRలలో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని సిట్ ప్రతిపాదించనట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో నివేదికను బయటపెట్టాలని కోరారు. అప్పుడే పారదర్శకత పెరిగి, ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుందని అన్నారు.

Similar News

News January 2, 2026

త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

image

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

News January 2, 2026

కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

image

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.

News January 2, 2026

ఏడాదిలో 166 పులుల మృత్యువాత

image

2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్‌గా పేరుపొందిన మధ్యప్రదేశ్‌లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ‘టైగర్స్ జనాభా సంతృప్తస్థాయికి చేరుకుంది. టెర్రిటరీల ఏర్పాటులో అవి ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడి చనిపోతున్నాయి’ అని వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా తెలిపారు.