News December 1, 2024
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం

AP: అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. డిప్యూటీ CM పవన్ <<14745624>>కాకినాడ<<>> పర్యటనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. DGPతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలింపులో ఎవరున్నారనేదాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలని చూస్తోంది.
Similar News
News March 25, 2026
నిజామాబాదు: ఇంటర్ తర్వాత ఏ కోర్సు మేలు?

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 35 వేల మంది విద్యార్థులు తమ తదుపరి అడుగుల కోసం సిద్ధమవుతున్నారు. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఎంపీసీ విద్యార్థులు ఏఐ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండగా, బైపీసీ విద్యార్థులు అగ్రి బిఎస్సీ, ఫార్మసీ వంటి రంగాలను ఎంచుకోవడం ఉత్తమం. కామర్స్ వాళ్లు సీఏ, బీబీఏ కోర్సులు ఉపాధిని ఇస్తాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ముందుకెళ్లాలి.
News March 25, 2026
శాంతి చర్చలపై ట్రంప్కు ఇరాన్ షరతులు!

శాంతి చర్చలపై <<19470089>>ట్రంప్<<>> పెట్టిన షరతులకు కౌంటర్గా ఇరాన్ కూడా కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. గల్ఫ్లోని US బేస్లు మూసివేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని, ఈజిప్ట్ సూయజ్ కెనాల్ తరహాలోనే హార్ముజ్లో షిప్పుల రాకపోకలపై ఫీజు వసూలు చేసుకుంటామని, అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు మిస్సైల్ ప్రోగ్రామ్ ఆంక్షలు పెట్టొద్దని, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 25, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.


