News March 19, 2025

క్రేన్ వక్కపొడి: 40KGల బంగారం, 100 KGల వెండి స్వాధీనం?

image

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Similar News

News January 6, 2026

కుంకుమ పువ్వు నుంచే ఏటా రూ.20 లక్షల ఆదాయం

image

ఏరోపోనిక్స్ విధానంలో తొలి విడతలో 450 గ్రాముల హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వుల్ని సుజాతా అగర్వాల్ సాగు చేశారు. తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్పత్తి క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి ఒక్కో విడతకు కిలో చొప్పున 2 విడతల్లో 2 కేజీల కుంకుమ పువ్వు ఉత్పత్తి అవుతోంది. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కావడంతో కిలోకు రూ.10 లక్షల చొప్పున ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని సుజాతా వెల్లడించారు.

News January 6, 2026

రేపు రాష్ట్ర మత్స్యకార సమాఖ్య ఎన్నికలు

image

AP: రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు రేపు విజయవాడ ఆప్కాఫ్ కార్యాలయంలో జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా రేపు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితాను ప్రకటించనున్నారు. అవసరమైతే ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సమాఖ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను జిల్లా సమాఖ్యలు ఎన్నుకుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,136 మత్స్యకార సంఘాలున్నాయి.

News January 6, 2026

దేశీ ఆవుల్లో కనిపించే ప్రత్యేక లక్షణాలివే..

image

దేశీ ఆవుల్లో ఇతర ఆవులు, గేదెలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలుంటాయి. దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. పాలు తీసేటప్పుడు గేదె తన పొదుగులో ఉన్న పాలను మొత్తం ఇచ్చేస్తుంది. ఆవు అలా కాదు. తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచి, పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. దేశీ ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఎక్కువ. గేదెలు ఎండలను తట్టుకోలేవు. ఆవులు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలవు.