News July 25, 2024
కుప్పకూలిన విమానం.. మృత్యుంజయుడు

నిన్న నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. కానీ ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ మనీశ్ శాక్య మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలవ్వగా ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కాఠ్మండూ ఎయిర్పోర్ట్లో శౌర్య ఎయిర్లైన్ విమానం కూలిపోయేముందు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో కాక్పిట్ ఆ కంటైనర్లో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న మనీశ్ తీవ్ర గాయాలైనా సజీవంగా బయటపడ్డారు.
Similar News
News October 14, 2025
కొత్త PF నిర్ణయాలు.. ఒక్కసారి ఆలోచించండి

EPFO ఎంప్లాయి షేర్ 100%తో పాటు ఎంప్లాయర్ షేర్ 100% విత్డ్రాకు అనుమతిస్తూ నిర్ణయించింది. ఇది ఊరటగా భావించి డబ్బు తీసుకుందాం అనుకుంటే.. ఆలోచించండి. ఇతర మార్గాలతో పోలిస్తే ఇక్కడ తీసుకుంటే లాభం అనుకుంటేనే డ్రా చేయండి. ఎందుకంటే ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్లో PFకు ఖాతాకే అధిక వడ్డీరేటు (8.25%) ఉంది. ఇప్పుడు తాత్కాలిక అవసరాలకు సర్దుకుంటే PFలో డబ్బుకు వడ్డీ, వడ్డీపై వడ్డీల లాభం భవిష్యత్తులో అండగా ఉంటుంది.
News October 14, 2025
బంగారం ధరలు పైపైకి.. జర భద్రం తల్లీ

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ సమయంలో మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు, రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో ఎక్కువ ఆభరణాలు ధరించకపోవడమే మేలు. ఇంట్లోని బంగారాన్ని సైతం సురక్షితమైన లాకర్లలో భద్రపరుచుకోవాలి. విలువైన వస్తువులు దొంగిలించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. Share it
News October 14, 2025
APPLY NOW: ఇంటర్తో 7,565 పోస్టులు

ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రిపేర్ కావాలి. జీతం నెలకు ₹21,700, అలవెన్సులు అదనం. వెబ్సైట్: https://ssc.gov.in/