News March 29, 2025
మేనేజర్గా పనిచేస్తున్న క్రేజీ హీరోయిన్

యువీతో డేటింగ్, ఖడ్గం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్రేజీ హీరోయిన్ కిమ్ శర్మ గుర్తుందా? ప్రస్తుతం ఆమె బాలీవుడ్ పార్టీల్లో తరచూ కనిపించే ఓర్రీకి చెందిన ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీకి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీని ₹10Cr లాభాల్లోకి తీసుకొచ్చారు. షారుఖ్, అమితాబ్ లాంటి స్టార్లతో నటించిన ఆమె మేనేజర్గా చేస్తుండటంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
Similar News
News October 15, 2025
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్!

యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్లు మిస్ అవకుండా నోటిఫికేషన్ వచ్చేలా కొత్త ఫీచర్ను వాట్సాప్ ట్రయల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్లో ఈ ట్రయల్ కొనసాగుతోంది. యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్ట్ స్టేటస్పై క్లిక్ చేసి పైన త్రీ డాట్స్పై క్లిక్ చేయాలి. అక్కడ ‘Get notifications’ ఆప్షన్ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
News October 15, 2025
డేటా సెంటర్కు నీరెందుకు అవసరం?

డేటా సెంటర్లలోని వేలాది సర్వర్లు, స్టోరేజీ డివైజులు, నెట్వర్కింగ్ పరికరాలు 24/7 రన్ అవుతాయి. దీంతో అధిక టెంపరేచర్ జనరేట్ అవుతుంది. వాటిని <<18016110>>కూల్<<>> చేయకపోతే హార్డ్వేర్ ఫెయిల్ కావడంతో పాటు అగ్నిప్రమాదాలూ జరగొచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్ మెగావాట్ల విద్యుత్, రోజుకు లక్ష నుంచి 5 లక్షల గ్యాలన్ల నీటిని వాడుకుంటుంది. చిల్లర్స్, లిక్విడ్ కూలింగ్, నీటి ఆవిరి, కూలింగ్ టవర్లు ఉపయోగించి వాటిని కూల్ చేస్తారు.
News October 15, 2025
IPS పూరన్ సూసైడ్: ట్విస్టులెన్నో.. (1/2)

TGకి చెందిన హరియాణా IPS అధికారి <<18001541>>పూరన్<<>> సూసైడ్ వెనుక ఎన్నో ట్విస్టులు. IT కథనం ప్రకారం.. రోహతక్ IGగా ఉన్న పూరన్ను PTCకి బదిలీ చేశారు. దీంతో సెలవు పెట్టి PSO సుశీల్తో కలిసి చండీగఢ్కు బయలుదేరారు. మధ్యలో ASI సందీప్ టీమ్ ఆ కారును ఆపి సుశీల్ను అదుపులోకి తీసుకుంది. ‘తర్వాత నీ వంతే’ అని పూరన్ను బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కోసం సుశీల్పై ఒత్తిడి చేసి వారం తర్వాత ACB కేసుపెట్టింది.