News August 10, 2024

క్రేజీ న్యూస్: ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి

image

టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణ చాలా రోజుల తర్వాత ఒకే వేదికను పంచుకోనున్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్‌లో గెస్ట్‌గా మెగాస్టార్ రాబోతున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.

Similar News

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

News November 24, 2025

118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>దుర్గాపూర్‌ 118నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc, MCA, M.LSc, M.P.Ed, MBBS, డిగ్రీ, ఇంటర్, ITI, NET, SET, SLET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1500, గ్రూప్ B పోస్టులకు రూ.1000. వెబ్‌సైట్:https://nitdgp.ac.in/

News November 24, 2025

AP న్యూస్ రౌండప్

image

* నెల్లూరు(D)లో గ్రీన్‌ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నట్లు ‘బిర్లాన్యూ’ వెల్లడించింది. తొలి దశలో ₹127Cr వెచ్చిస్తామని, 600 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
* పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు PPP విధానాన్ని అనుసరిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. 2029 నాటికి ₹66000Cr పెట్టుబడులు సమీకరిస్తామంది.
* తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు: తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ విల్సన్