News February 5, 2025
క్రేజీ రికార్డ్.. దూబే జట్టులో ఉంటే భారత్ గెలుపు పక్కా

భారత ఆల్రౌండర్ శివమ్ దూబే ఓ క్రేజీ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అతను జట్టులో ఉన్న 30 T20లలో IND వరుసగా విజయం సాధించింది. దూబే 2019 నవంబర్ 3న బంగ్లాపై తొలి మ్యాచ్ ఆడగా ఇండియా ఓడిపోయింది. తొలి 5 మ్యాచ్లలో జట్టుకు 2 ఓటములు ఎదురయ్యాయి. 2019 డిసెంబర్ 11న విండీస్పై గెలుపు నుంచి దూబే టీమ్లో ఉన్న ప్రతిసారీ విజయం సొంతమైంది. దీంతో ఇతనిది లక్కీ జాతకమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 30, 2025
బాహుబలి టికెట్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త!!

కొత్త సినిమా టికెట్లు ఉన్నాయంటూ SMలో కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రీమియర్ టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఓ వ్యక్తి(Heisenberg M) ట్వీట్ చేశాడు. ఇది నమ్మి డబ్బులు పంపి మోసపోయామని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఖిలాడి చెప్పిన 9391872952 నంబర్కు డబ్బులు పంపిన తర్వాత బ్లాక్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో <<18117184>>తీవ్రంగా<<>> గాయపడటంపై టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమయంలో అభిమానులు మద్దతుగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆసీస్తో చివరి వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ గాయపడ్డారు. దీంతో అతడికి ఐసీయూలో చికిత్స అందించారు.
News October 30, 2025
వంటింటి చిట్కాలు

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.


