News April 11, 2024
క్రేజీ అప్డేట్: ‘వార్-2’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ!

యంగ్టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘వార్-2’ మూవీపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. రేపు ఈ మూవీ సెట్స్లో ఎన్టీఆర్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఈ షూట్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎన్టీఆర్ 60 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, శార్వరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జాన్ అబ్రహాం విలన్ పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News March 19, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
News March 19, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
News March 19, 2026
EPF పెన్షన్ ₹1000 సరిపోదు: పార్లమెంటరీ ప్యానెల్

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద నెల వారీ పెన్షన్ కేవలం ₹1000 ఇస్తుండడాన్ని తక్షణమే సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. గౌరవప్రదమైన స్థాయిలో ప్రజల పెన్షన్లు ఉండాలని పేర్కొంది. కనీస పెన్షన్ ₹7,500 చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవనవ్యయం పెరిగినా అమౌంట్ మారలేదని.. బడ్జెట్లో కేటాయింపులు పెంచే విషయాన్ని పరిశీలించాలని కమిటీ పేర్కొంది.


