News February 11, 2025
బర్డ్ఫ్లూపై అవగాహన కల్పించండి: ప్రభుత్వం

TG: బర్డ్ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఫారాల్లో బర్డ్ఫ్లూతో కోళ్లు మృతిచెందిన నేపథ్యంలో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లిలో కోళ్ల మరణాలకూ బర్డ్ఫ్లూ కారణమని భావిస్తున్నారు.
Similar News
News November 22, 2025
హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.
News November 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 22, 2025
AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీ టెట్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్సైట్: https://tet2dsc.apcfss.in/


