News April 8, 2025

CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్‌గా ధర్మేందర్

image

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది.‌ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

Similar News

News February 18, 2026

రేపు విశాఖలో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

News February 18, 2026

విశాఖలో అట్టహాసంగా ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ

image

విశాఖపట్నం తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 71 యుద్ధనౌకల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ‘సముద్రాల ద్వారా ఐక్యత’ (United Through Oceans) అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుక దేశాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని, వివిధ దేశాల నావికుల కలయిక ప్రపంచ ఐక్యతకు నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు.