News April 5, 2024
క్రికెట్ పిచ్చి.. టికెట్ కౌంటర్ల వద్దే నిద్రించారు
ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రేపు జైపూర్ వేదికగా RCB, RR మ్యాచ్ జరగనుండగా టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తమ అభిమాన ప్లేయర్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఫ్యాన్స్ టికెట్ల కోసం గత రాత్రే దుప్పటి, దిండు పట్టుకుని స్టేడియం వద్దకు వచ్చారు. ఉదయం క్యూ లైన్ ఎక్కువగా ఉంటుందని భావించి వారు ఇలా వచ్చారు.
Similar News
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.