News July 9, 2024
T20WCలో క్రికెటర్ల మందు పార్టీ.. ఖండించిన శ్రీలంక బోర్డు

T20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే శ్రీలంక టీమ్ నిష్క్రమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టోర్నీలో కీలక మ్యాచ్కు ముందు ఆటగాళ్లు మందు పార్టీ చేసుకున్నారంటూ ఓ మీడియా సంచలన కథనం రాసింది. దీన్ని శ్రీలంక బోర్డు ఖండించింది. అమెరికాలో అలాంటి ఘటనలేవీ జరగలేదని స్పష్టం చేసింది. లంక ప్లేయర్లను అప్రతిష్ఠపాలు చేయడానికి ఆ వార్తను ప్రచురించిందని పేర్కొంది.
Similar News
News October 17, 2025
లోకేశ్ ట్వీట్కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.
News October 17, 2025
నవంబర్ 11న సెలవు

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News October 17, 2025
తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <