News August 19, 2025
రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది: KTR

TG: కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని BRS నేత KTR అన్నారు. ‘వారంలోనే HYDలో 2 షాకింగ్ క్రైమ్స్ జరిగాయి. పట్టపగలే ఓ జువెలరీ షాప్లో చోరీ, కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక <<17444868>>హత్య<<>> ఘటనలు చోటుచేసుకున్నాయి. పబ్లిక్ సేఫ్టీ ప్రమాదంలో పడింది. ప్రజలకు రక్షణ కావాలి.. భయం కాదు. సమర్థులైన TG పోలీసులను లా & ఆర్డర్ కోసం కాకుండా రాజకీయ అవసరాలకు వాడుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని ఫైరయ్యారు.
Similar News
News August 19, 2025
‘ఇంకేముంది.. అంతా అయిపోయింది’.. హరీశ్ రావు ఫొటోకు మంత్రి క్యాప్షన్

TG: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ప్రదర్శించిన ఫొటోలను పరిశీలించిన ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఓ ఫొటోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హావభావాలు ‘ఇంకేముంది.. అంతా అయిపోయింది’ అన్నట్లుగా ఉన్నాయని సెటైర్ వేశారు. ఈ ఫొటో తీసిన కెమెరామెన్ ప్రత్యేక కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు.
News August 19, 2025
ప్రభాస్ మూవీలను దాటేసిన చిన్న సినిమా

యానిమేషన్ వండర్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. హిందీలో ఈ మూవీ సాహో(రూ.150 కోట్లు), సలార్(రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. 25 రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్లు దాటొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైంది.
News August 19, 2025
రోహిత్, కోహ్లీ.. ప్రాక్టీస్ మొదలెట్టారు!

భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో రోహిత్ జిమ్లో కసరత్తు చేస్తున్న ఫొటో వైరలవుతోంది. మరోవైపు విరాట్ లండన్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్తో దిగిన సెల్ఫీ SMలో హాట్ టాపిక్గా మారింది. ‘వరల్డ్ కప్ వేట మొదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ AUSతో OCT 19న స్టార్ట్ కానున్న ODI సిరీస్లో ఆడే అవకాశముంది.