News November 5, 2024

కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.

Similar News

News December 22, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,35,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,000 ఎగబాకి రూ.1,24,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,31,000కు చేరింది. వెండి ధర 3 రోజుల్లోనే రూ.10వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 22, 2025

ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

image

MGNREGA స్థానంలో కేంద్రం కొత్తగా తెచ్చిన VB-G RAM G చట్టంతో రైతులకు ఊరట దక్కనుంది. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పీక్ అగ్రికల్చర్ సీజన్ (పంటలు వేసే, కోసే)లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల రైతులకు కూలీల కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరగడంతో కూలీల ఆదాయం 25% పెరగనుంది.

News December 22, 2025

27న మండల పూజ.. ఆ రోజుల్లో శబరిమల ఆలయం మూసివేత

image

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10.10AM నుంచి 11.30AM వరకు కొనసాగనుంది. ‘26న 6.30PMకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. స్వామిని అలంకరించి దీపారాధన నిర్వహిస్తాం. 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తాం. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న 5PMకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.