News November 5, 2024
కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News December 23, 2025
4,116 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. FEBలో మెరిట్ జాబితా విడుదల చేస్తారు. వెబ్సైట్: www.rrcnr.org *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 23, 2025
మిరపలో వేరు పురుగు వల్ల నష్టం

మిరప పంటను ఆశించే వేరు పురుగు మొక్కల వేర్లను కొరికి తినడం వల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. ఇవి నేలలో “C” ఆకారంలో తెల్లగా ఉంటాయి. మిరప పంట కాలపరిమితి దాటిన తర్వాత ఈ పురుగులు వేప, రేగు, మునగ వంటి పంటలను ఆశించి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఈ వేరు పురుగు ఆశించిన మొక్కలు పీకితే సులభంగా ఊడి వస్తాయి. వీటి ఉద్ధృతి తీవ్రమైతే పెద్ద మొత్తంలో మొక్కలు చనిపోయి, దిగుబడి తగ్గిపోతుంది.
News December 23, 2025
AIIMS భోపాల్ 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<


