News November 5, 2024
కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News December 11, 2025
థాయ్లాండ్లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్

గోవా నైట్క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్లాండ్లో పట్టుబడ్డారు. డిసెంబర్ 7న రాత్రి క్లబ్లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్నూ భారత్కు తీసుకురానున్నారు.
News December 11, 2025
సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.
News December 11, 2025
పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం: పెమ్మసాని

AP: అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో ప్రస్తుత, లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ‘రాజధానిగా 2014 నుంచా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే సాంకేతిక కారణంతో బిల్లు ఆలస్యమైంది. CBN మానిటర్ చేస్తున్నారు. అనేక సంస్థలు ఇప్పటికే కొలువుదీరుతున్నాయి. BILLపై విషం కక్కుతున్న జగన్ను రాజకీయ సమాధి చేయాలి. AP భవిష్యత్ను నాశనం చేశారు’ అని దుయ్యబట్టారు.


