News August 23, 2025

12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు: ADR

image

దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో ADR ఈ రిపోర్టును విడుదల చేసింది.

Similar News

News August 23, 2025

CHECK NOW.. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

image

AP: ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుకు ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ <>క్లిక్ <<>>చేసి, దరఖాస్తు చేసిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆమోదం వస్తే కొత్తగా QR కోడ్ రేషన్ కార్డు వస్తుంది.

News August 23, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.1,01,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,000 ఎగబాకి రూ.93,150 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 23, 2025

SBI క్రెడిట్ కార్డు హోల్డర్లకు అలర్ట్

image

సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. డిజిటల్ గేమింగ్ లావాదేవీలు, ప్రభుత్వ చెల్లింపులపై రివార్డు పాయింట్లు రావని వెల్లడించింది. లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI సెలక్ట్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు ప్రైమ్‌లకు ఇది వర్తిస్తుంది. ఇటీవల HDFC కూడా గేమింగ్ లావాదేవీలపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది.