News August 23, 2025

12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు: ADR

image

దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో ADR ఈ రిపోర్టును విడుదల చేసింది.

Similar News

News March 17, 2026

ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని కేంద్రం సూచన

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. LPGకి బదులు వీలున్నవాళ్లు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని తెలిపింది. ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్‌ను పొదుపు చేయడం కోసం ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలంది. ఎట్టిపరిస్థితుల్లో పానిక్ బుకింగ్ చేయొద్దని కోరింది.

News March 17, 2026

‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

image

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్‌పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.

News March 17, 2026

SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

image

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.