News March 16, 2024
మోదీపై విమర్శలు బ్యాక్ఫైర్ అవుతున్నాయి: అబ్దుల్లా
ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శలతో వాటికే నష్టం వాటిల్లుతోందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండియా టుడే కాంక్లేవ్లో వ్యాఖ్యానించారు. ‘బహుశా మోదీకి టెఫ్లాన్ పూత ఉందేమో. ప్రతిపక్షాలు మోదీపై ఏ విమర్శలు చేసినా అవి బ్యాక్ఫైర్ అవుతున్నాయి. ఆయన్ని టార్గెట్ చేసుకోవడమే మనం చేస్తున్న తప్పు. ‘కాపలాదారు దొంగ, అంబానీ, అదానీ’ వంటి విమర్శలతో ఇక పనికాదు. అనుభవంతో చెప్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News September 29, 2024
1130 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో ఫైర్ విభాగంలో 1130 కానిస్టేబుల్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తోంది. ఇంటర్ పూర్తి చేసి, 18-23 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్ లింక్: https://cisfrectt.cisf.gov.in/
News September 29, 2024
కొత్త NCA ప్రత్యేకతలు ఇవే
బెంగళూరులో సకల సౌకర్యాలతో బీసీసీఐ కొత్త ఎన్సీఏను రూపొందించింది. దాదాపు 40 ఎకరాల్లో 3 మైదానాలు సిద్ధం చేశారు. వీటిలో ఇన్డోర్, ఔట్డోర్ కలిపి ఏకంగా 86 పిచ్లు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్పూల్, 80 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, స్పా, స్టీమ్ బాత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఫిజియోథెరపీ జిమ్, స్పోర్ట్స్, సైన్స్, మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభిస్తారు.
News September 29, 2024
రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం
FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.