News July 11, 2024

శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు

image

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సెంచరీ బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో వచ్చి 10 రన్స్‌కే ఔటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంచరీ చేసిన ఆటగాడి స్థానం మార్చడమేంటంటూ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. వన్‌డౌన్ తాను వెళ్లకుండా అభిషేక్‌ను డిమోట్ చేశారంటూ మండిపడుతున్నారు. అభిషేక్ స్పిన్ హిట్టర్ కాబట్టే వన్ డౌన్‌లో పంపించారంటూ గిల్ ఫ్యాన్స్‌ మద్దతుగా నిలుస్తున్నారు.

Similar News

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

image

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.

News November 27, 2025

30 రోజుల్లో 1400 భూకంపాలు

image

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్‌ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.