News July 23, 2024
ఏపీ-బిహార్ బడ్జెట్లా ఉందని విమర్శలు!

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానిదా లేక బిహార్, ఏపీ రాష్ట్రాలదా అని కొందరు మండిపడుతున్నారు. ఏపీలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. బిహార్లో రోడ్డు ప్రాజెక్టులకు రూ. 26,000 కోట్లు కేటాయించారు. దీంతో 8 MPలు ఇచ్చిన తెలంగాణను మరిచిపోయారా? అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News April 3, 2026
సంజీవ్ గోయెంకా జోకర్: లలిత్ మోదీ

LSG ఓనర్ <<19547295>>సంజీవ్ గోయెంకా<<>>పై IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఓడిపోతే అతను తన టీమ్ కెప్టెన్, కోచింగ్ స్టాఫ్తో వ్యవహరించే తీరును ఎండగట్టారు. ఆయన ఓ లూజర్, జోకర్ అంటూ మండిపడ్డారు. ప్లేయర్లు, అభిమానుల కోసం లీగ్ను సృష్టించానన్నారు. తానింకా IPL ఛైర్మన్గా ఉంటే ఆయన్ను బ్యాన్ చేయడంతో పాటు జట్టుపై అతని యాజమాన్యాన్ని శాశ్వతంగా రద్దు చేసేవాడిని అని ట్వీట్ చేశారు.
News April 3, 2026
సేతుపతి-సాయిపల్లవి మూవీ.. జూన్లో సెట్స్పైకి!

విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కించనున్న కొత్త మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ కానుంది.
News April 3, 2026
మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.


