News January 10, 2025

బీజేపీ నేత ఇంట్లో మొస‌ళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్‌

image

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన BJP Ex MLA హ‌ర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయ‌గా ₹3 కోట్ల డ‌బ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొస‌ళ్లు దొర‌క‌డంతో IT అధికారులు అవాక్క‌య్యారు. సాగ‌ర్ న‌గ‌రంలో హ‌ర్వంశ్ సింగ్‌తోపాటు బీడీ వ్యాపార భాగ‌స్వామి రాజేశ్ కేశ‌ర్వాని ఇళ్ల‌లోనూ సోదాలు నిర్వ‌హించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. రాజేశ్ ఒక్క‌డే ₹140 కోట్లు ఎగ్గొట్టిన‌ట్టు తెలిపారు.

Similar News

News December 7, 2025

MHBD: ముగిసిన చివరి దశ స్క్రూటీని

image

జిల్లా వ్యాప్తంగా రెండో దశ అభ్యర్థుల స్క్రూటీని ప్రక్రియ ముగిసింది. డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, సీరోల్, మరిపెడ మండలాల్లో మొత్తం 169 జిపి లకు 1185 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. శనివారం స్క్రూటీనీ అనంతరం 925 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. కాగా 1412 వార్డ్ మెంబర్ స్థానాలకు 3,592 నామినేషన్లు స్వీకరించగా 3,408 చెల్లుబాటు అయినట్లు అధికారులు ప్రకటించారు.

News December 7, 2025

గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 1/2

image

ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతుండటం తెలిసిందే. విమాన సర్వీసుల్లో అగ్ర వాటా(63%) ఇండిగోది కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఎక్కడైనా ఓ సంస్థ/కొన్ని సంస్థల <<18493058>>గుత్తాధిపత్యం<<>> ఉంటే ఆ రంగంలో మిగతా సంస్థలు నిర్వీర్యమవుతాయి. టెలికం రంగం ఇందుకో ఉదాహరణ. ఇప్పుడు 4 కంపెనీలే ఉన్నాయి. Aircel, DoCoMo, Telenor, MTNL, Reliance వంటివి విలీనమయ్యాయి లేదా దివాలా తీశాయి. విమానయాన రంగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.

News December 7, 2025

గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 2/2

image

గుత్తాధిపత్యం(Monopoly) వల్ల ఆ రంగంలో సర్వీసులు పరిమితమవుతాయి. వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు అతి తక్కువ. తాము ఎంచుకునే ఏ ధరనైనా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకు ఉంటుంది. పోటీ పెద్దగా ఉండదు. కొత్త సంస్థలు ప్రవేశించాలన్నా చాలా కష్టం. చిన్న సంస్థలు వాటిలో విలీనం కావడమో, దివాలా తీయడమో జరుగుతుంది. బడా సంస్థల ఉత్పత్తి/సేవల్లో అంతరాయం ఏర్పడితే ఇండిగో లాంటి సంక్షోభం ఎదురవుతుంది. దీనిపై మీ కామెంట్?