News July 18, 2024

TGలో 56.08 లక్షల ఎకరాల్లో పంటల సాగు

image

తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్‌లో 206.20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటివరకు 229.40MM వర్షాపాతం నమోదైనట్లు పేర్కొంది.

Similar News

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

image

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.