News July 18, 2024
TGలో 56.08 లక్షల ఎకరాల్లో పంటల సాగు

తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో 206.20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటివరకు 229.40MM వర్షాపాతం నమోదైనట్లు పేర్కొంది.
Similar News
News December 1, 2025
మన ఎంపీలు గళమెత్తాల్సిన సమయం

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్నూలు–నంద్యాల, కర్నూలు-మంత్రాలయం మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణం, ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలుషితం సమస్యలు, మొక్కజొన్న పంటకు మద్దతు ధర, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కేంద్ర ప్యాకేజీ అవసరంపై మన ఎంపీలు పార్లమెంట్లో గళమెత్తాల్సిన అవసరం ఉంది.
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


