News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో పంట నష్టం

image

గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

Similar News

News February 1, 2026

NZB: రాష్ట్ర స్థాయి సీనియర్ క్రికెట్ టోర్నీకి జిల్లా మహిళ జట్టు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళ క్రికెట్ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ జిల్లా జట్టు ఖరారైనట్లు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. HCA ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీకి జిల్లా నుంచి 19 మంది క్రీడాకారిణులను ఎంపిక చేశారు. ఈనెల 2 నుంచి 7 వరకు వరంగల్‌లో జరిగే టోర్నీలో పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి వారిని అభినందిచారు.

News February 1, 2026

NZB: తెలంగాణకు గుండు సున్నానే దక్కింది: కవిత

image

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 12 ఏళ్లుగా TG ప్రజలను బీజేపీ సర్కార్ మోసం చేస్తుందని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రి కిక్కురుమనలేదన్నారు. మోదీ చెప్పే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

News February 1, 2026

NZB: ఆపరేషన్ స్మైల్‌తో 161 మంది పిల్లల గుర్తింపు

image

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్:XII లో భాగంగా ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 161 మంది తప్పిపోయిన బాలబాలికలకు రెస్క్యూ చేసినట్లు సీపీ సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటు మొత్తం 52 FIRలు నమోదు కాగా అందులో నిజమాబాద్: 15, ఆర్మూర్: 23, బోధన్ డివిజన్‌లో 14 చొప్పున నమోదు అయినట్లు వివరించారు.